పెరుగుతోన్న గోదావరి నీటి మట్టం

రాజమండ్రి: గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 8.9 అడుగులకు పైగా నీరు చేరింది. సుమారు 3లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వరదనీరు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.