పేదలకు గృహరుణ వడ్డీపై రాయితీ

` ఎర్రకోట హామీలపై ప్రధాని మోదీ సమీక్ష
ఢల్లీి(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన హావిూల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయా పథకాల విధివిధానాలు, అమలు గురించి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా శనివారం సవిూక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు.పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా వారికి రుణ సదుపాయం గురించి ప్రధాని మోదీ స్వాతంత్య్రో దినోత్సవం రోజున ప్రకటన చేశారు. గృహాలకు సౌర విద్యుత్‌ గురించీ మోదీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయా పథకాల అమలుపై ప్రధాని సవిూక్ష నిర్వహించారు. నగరాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి బ్యాంకు రుణాలు, వడ్డీలో ఉపశమనం కల్పించేందుకు గృహ రుణంపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్రం తీసుకురానున్నట్లు తెలుస్తోంది.