పేద క్రైస్తవుల కోసమే క్రిస్మస్ కానుకలు

పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని క్రిస్మస్ సోదరులకు క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ పిఎస్ మినిస్టర్ చర్చ్ దినకర్ నగర్ లో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం పాస్టర్ల సమక్షంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ కానుక లో పురుషులకు పాయింట్లు షర్ట్ పీసులు మహిళలకు చీర డ్రెస్ మెటీరియల్ ఉంటుందన్నారు. క్రైస్తవుల పండుగ క్రిస్మస్ ను గుర్తించి ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానుకలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, పాస్టర్స్ మృత్యుంజయ, పాస్టర్ నోవా, పాస్టర్ దినకరన్, ఇస్తేరమ్మ, రమేష్, ప్రవీణ్, స్థానిక నాయకులు ప్రభాకర్, శివ, కిట్టు, కుట్టి, అనిల్, పెంటన్న, హృదయా, లక్ష్మీ, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.