పేద విద్యార్ధికి ఆర్థిక సాయం.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 19, (జనంసాక్షి )
నిరుపేద విద్యార్థి చదువుకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన కందుల ప్రియాంకకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లో బిఎస్సి హార్టికల్చర్ సీటు వచ్చినందున రూ. 20,000 నగదు అందించి ఆదుకున్నారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చులు అన్ని తానే స్వయంగా భరిస్తానని హామీ ఇచ్చారు.