పేపరు మిల్లులో అగ్నిప్రమాదం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు వద్ద రాందాన్‌ పేపరు మిల్లులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో పేపరు వ్యర్థాలతోపాటు 2,500 టన్నుల ముడిసరుకు దగ్ధమైంది. మంటలు ఎగసి పడుతుండటంతో పరిశ్రమ పక్కనే ఉన్న ఇళ్లు దగ్ధమయ్యాయి. నాలుగు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదంలో రూ.ఐదు కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు పరిశ్రమ వర్గాలు అంచనావేస్తున్నాయి.