పైలెట్ ఆత్మీయ పలకరింపుకు విశేష స్పందన.

పైలెట్ ఆత్మీయ పలకరింపుకు విశేష స్పందన.

తాండూరు అక్టోబర్ 3(జనంసాక్షి) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.పైలెట్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం తాండూరు పట్టణానికి చెందిన పలువురు బీఅర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపే లక్ష్యంగా పనిచేయాల ని సూచించారు.కలిసికట్టుగా కృషిచేసి విజయానికి నాంది పలకాలన్నారు.తాండూర్ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధికి తోడ్పడుతానని వెల్లడించారు. ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాలని అప్పుడే విజయం సునాయాసం అవుతుందని తెలిపారు. పైలట్ ఆత్మీయ పలకరింపు లో భాగంగా పలువురు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి తప్పకుండా మీ వెంటే ఉండి విజయానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.