పోక్సో చట్టం తీర్పులో అసంబద్దత

జడ్జి హక్కులను కోల్పోయిన మహిళా జడ్జి
శాశ్వత హోదా కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం నిరాకరణ
న్యూఢల్లీి,డిసెబర్‌17  (జనంసాక్షి):  లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు, నిందితుని మధ్య శారీరక సంబంధం లేనపుడు, ఆ దాడిని పోక్సో చట్టం క్రింద లైంగిక దాడిగా పేర్కొనడం సాధ్యం కాదని తీర్పు చెప్పిన జడ్జికి శాశ్వత హోదా కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం నిరాకరించింది. ఈ మహిళా న్యాయమూర్తి ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన రెండు తీర్పులను అత్యున్నత న్యాయస్థానం నవంబరు 18న రద్దు చేసింది. బోంబే హైకోర్టు నాగపూర్‌ ధర్మాసనం అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనెడివాలా పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి నిబంధనలను వివరించారు. ఓ మైనర్‌ బాలికను అనుచితంగా తడిమినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితునికి ఆమె బెయిలు మంజూరు చేశారు. బాధితురాలు, నిందితుని మధ్య శారీరక సంబంధం లేనందువల్ల ఈ దాడిని పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడిగా పేర్కొనజాలమని తెలిపారు. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. చాలా మంది తీవ్రంగా విమర్శించారు. మరో కేసులో ఓ ఐదేళ్ల బాలిక చేతులను నిందితుడు పట్టుకోవడం, నిందితుడు తన ప్యాంటు జిప్‌ను ఓపెన్‌ చేయడం లైంగిక దాడి నిర్వచనం పరిధిలోకి రాదని జస్టిస్‌ పుష్ప తీర్పు చెప్పారు.
ఆ నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ విూడియా తెలిపిన వివరాల ప్రకారం, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబరు 14న సమావేశమైంది. ఈ సమావేశంలో జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ కూడా పాల్గొన్నారు. జస్టిస్‌ పుష్ప గనెడివాలాను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేయరాదని ఈ సమావేశం నిర్ణయించింది. ఇటువంటి కేసుల్లో ఆమెకు గతంలో అనుభవం లేనట్లు కనిపిస్తోందని అభిప్రాయపడిరది. అయితే బోంబే హైకోర్టు అదనపు జడ్జిలు ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రతిపాదనలను ఆమోదించింది.