పోలీస్‌స్టేషన్లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

ఢిల్లీ : పదహారేళ్ల బాలిక ఢిల్లీలోని ఒక పోలీస్‌ స్టేషన్లో శనివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఆమె పనిమనిషిగా పనిచేస్తోందని, శుక్రవారం వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అమెను స్త్రీలు దుస్తులు మార్చుకునే గదిలో ఉండమని కోరామని, అమె చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుందని వారు తెలిపారు. ఇష్టంలేని పెళ్లి కారణంగా అమె ఇంటినుంచి వెళ్లిపోయిందని, ఆత్మహత్యకు కూడా అదే కారణమని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.