పోలీస్ స్టేషన్ ముందు దళితుల ఆందోళన
శ్రీకాకుళం,ఫిబ్రవరి11(జనంసాక్షి): రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్-రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ
అధ్యక్షులు నడకుదిటి ఈశ్వరరావుని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. రణస్థలం మండల దళితులు జెఆర్ పురం పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం 16వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు వైవి.రమణ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేస్తే… దళితులపై ఈశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం దళితులను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అవమానపరిచిన ఈశ్వరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.