ప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేకు సన్మానం

బిచ్కుంద ఫిబ్రవరి 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు సోమవారం నాడు తన కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు 4 లైన్ల రోడ్డు మరియు సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అసద్ అలీ, డాక్టర్ నాసర్ ఖాన్, నాల్చర్ రాజు, అశోక్ పటేల్, వెంకట్రావు దేశాయ్ మరియు మార్కో టైలర్ నజీర్ ఖాన్ తదితరులు ఉన్నారు.