ప్రచారంలో దూసుకుని పోతున్న మనోజ్ తివారి
న్యూఢిల్లీ,ఏప్రిల్22(జనంసాక్షి): బోజ్పూరి నటుడు మనోజ్ తివారీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఢిల్లీ నార్త్ ఈస్ట్ నుంచి బీజేపీ అభ్యర్తి గా పోటీ చేస్తున్న ఆయన.. ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మనోజ్ తివారికి మద్దతుగా బిహార్ పాప్ సింగర్ సప్నా చౌదరి ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ పై బరిలోకి తివారి దిగుతున్నారు. మోడీ చేసిన అభివృద్ధి పనులే బీజేపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఆప్తో పొత్తు కుదరని కారణంగా కాంగ్రెస్ ఒంటరి పోరుకు దిగింది. దీంతో ఢిల్లీలో ముక్కోణపు పోటీ నెలకొంది.