ప్రచారంలో పాల్గొన్నమాజీ సర్పంచ్

భువనగిరి రూరల్,జనం సాక్షి:మే 11, 2024. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది.గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులను కలిసి ఈ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొచ్చింది.కాబట్టి కార్మికులందరూ ఆలోచన చేసి పని లేని నిరుపేద కుటుంబాలకు పని కల్పించినటువంటి ఏకైక పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వారికి వివరించడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ శివరాజ్ గౌడ్,రాష్ట్ర నాయకులు రావి సురేష్ రెడ్డి రావి అశోక్ రెడ్డి,సుక్క స్వామి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు గాదె కరుణాకర్,మండల నాయకులు సాయి రెడ్డి,మోహన్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొక్క శ్రీనివాస్ రెడ్డి,గుండాల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ ఎస్కే జమాల్,చుక్క కొండల్, యూత్ కాంగ్రెస్ మందడి సురేష్ రెడ్డి, వాసగోని సాయి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి శివమణి,వనగంటి బాలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు