ప్రజల పై ఔషధ ప్రయోగాలు దారుణం : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ప్రజలపై నియంత్రణ లేని ఔషధ ప్రయోగాలు దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజలపై ఔషధ ప్రయోగాలను అడ్డుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించింది. ఆరోగ్యశాఖ కార్యదర్శి పర్యవేక్షణలోనే ఔషధ ప్రయోగాలు జరపాలని అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.