ప్రతికూల వాతావరణంతో విమానాల దారిమళ్లింపు

న్యూఢిల్లీ,మే18(జ‌నంసాక్షి): ప్రతికూల వాతావరణం కారణంగా  న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 32 విమానాలను దారి మళ్లించారు. భారీవర్షంతో పాటు ఆకాశం మేఘావృతమై గాలులు వీయడంతో పలు ప్రాంతాల నుంచి ఢిల్లీకి రావాల్సిన 32 విమానాలను ఢిల్లీ సవిూపంలోని లక్నో, జైపూర్‌, అమృత్‌సర్‌ విమానాశ్రయాలకు దారి మళ్లించామని న్యూఢిల్లీ విమానాశ్రయం అధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు. దీంతో పాటు 45 విమాన సర్వీసుల రాకపోకల్లో జాప్యం కూడా జరిగింది. దీంతో విషయం తెలియక ప్రయాణికులు తికమకపడ్డారు.