ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే కేసీఆర్ లక్ష్యం.. ఎమ్మెల్యే

ఆలేరు. జనం సాక్షి 24

 

ఆలేరు పట్టణ కేంద్రం లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే కెసిఆర్ లక్ష్యమని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్య విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అనంతరం స్థానిక ఆలేరు మున్సిపల్ కార్యాలయం లో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బుధవారం న 431 లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల కార్డు లను అందజేశారు.ఈ సందర్బంగా విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో కూడా ఒక పండగ వాతావరణం కనబడతా ఉంది, అన్ని, ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఆసరా పింఛన్ల లు 2060 మంది లబ్ది పొందుతూనరాని, కొత్తగా 431 మందికి కొత్తగా పెన్షన్లు కార్డు లు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మోరిగాడి మాధవి, వెంకటేష్, కౌన్సిలర్ లు బేతి రాములు, రాయపురం నర్సింహులు, దాసి నాగలష్మి, సంతోష్, మోర్చాలా సునీత, చింతపణి సునీత, సంగు భూపతి, గుత్తా శమంతక రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఎండీ రీయాజ్, సీసా రాజేష్, బుల్య రాణి, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, పత్తి వెంకటేష్, యూత్ అధ్యక్షులు పూల శ్రవణ్, మహ్మమూద్, జింకల భరత్, ఎండీ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.