ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలి- శంషాబాద్ జెడ్పిటిసి నీరటి తన్విరాజ్

ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని శంషాబాద్ జెడ్పిటిసి నీరటి తన్విరాజ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలు సాయిలమ్మ నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి శంషాబాద్ జెడ్పిటిసి నీరటి తన్విరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్,టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు అనేగౌని శ్రీకాంత్ గౌడ్,ఎంపీటీసీ యాదగిరి,ఉపసర్పంచ్ స్వరూప గౌడ్, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి,బాబు కిరణ్,రమేష్,శ్రీశైలం,బిక్షపతి,రవి,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : పెద్ద గోల్కొండలో నూతన ప్రవేశంలో పాల్గొన్న జడ్పిటిసి నీరటీ తన్వీరాజ్.