ప్రతి యువకుడు ఛత్రపతి శివాజీ కావాలి

– బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా మంథని అయ్యప్ప స్వామి వారి ఆలయం నుండి యువత భారీ శోభ యాత్రగా మంథని పుర విధుల నుండి వెళ్లారు.అనంతరం మంథని బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాని ముఖ్య అతిధిలుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. మంథని ప్రాంతం అంత శివాజీ నామస్మర తో మారుమోగింది. కార్యక్రమని ఉద్దెశించి సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. మరాఠ యోధుడు, మొగల్ సామ్రాజ్యని గడగడ లాడించిన వీరుడు ఛత్రపతి శివాజీ, దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి ఎంతో మందికి ఆదర్శం శివాజీ, ప్రతి యువకు ఛత్రపతి శివాజీ కావాలి, భారత దేశాన మరాఠ సామ్రాజ్యని నెలకొల్పి, మొగల్ సామ్రాజ్యన్ని ఎదురించి మరాఠ వీరుడుగా పేరుగాంచిన భారత మాత ముద్దుబిడ్డ మహిళలను గౌరవించి, సతిసహాగమనం రూపిమపాడు, హిందూ ధర్మనికి వన్నె తెచ్చిన వీరుడు,16 సంవత్సరాల వయసు లో కత్తి పట్టి శత్రువులను చెండాడిన దీశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్, అన్ని కులాలను మతాలు సమానంగా గౌరవించి మత సామరస్యాన్ని నెల్కొల్పాడు, గొరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తూ ఎన్నో సంస్థానాలను దక్కించుకున్నాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు, శివాజీ సేన సభ్యులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.