ప్రత్యేక¬దాపైనే రాహుల్ తొలి సంతకం: కాంగ్రెస్
కడప,ఫిబ్రవరి28(జనంసాక్షి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ మొట్టమొదటి సంతకం ఏపీ ప్రత్యేక ¬దా బిల్లుపైనే పెడతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక ¬దా కల్పించడానికి బిల్లు ఆమోదిస్తే దాన్ని భాజపా అమలు చేయకుండా మొండిచెయ్యి చూపిందన్నారు. బాబు, జగన్లను మోడీ జేబులో పెట్టుకుని రాజకీయ ఆటలు ఆడుతున్నారని అన్నారు. సీఎం నిత్యం అమరావతి సినిమా చూపిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమై అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజుపట్నం ఓడరేవు, జాతీయ విద్య, వైద్య సంస్థలు ఇలా పలు అంశాలను చట్టంలో పొందుపర్చారన్నారు. భాజపా, తెదేపాలు చట్టంలో పొందుపర్చిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి నాలుగేళ్లు గడిచినా నేటికీ అమలు చేయలేదన్నారు. తెదేపా, భాజపాలు మన హక్కులతో పాటు ఆంధ్రుల ఆత్మాభిమానాలను దెబ్బతీశాయన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిని ఊరికే వదలమని అన్నారు. అధికార, విపక్ష పార్టీలు అసలు విషయాలను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పాకులాడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి ప్రత్యేక ¬దా కోసం పోరాడాలన్నారు.