ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అగ్ని-5 క్షిపణి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవాలు దేశ రాజరాజధానిలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌ ఆకట్టుకుంది. భారత ఆయుధ సంపత్తి అస్త్ర శస్త్రాలను త్రివధ దళాలు ప్రదర్శించాయి. అగ్ని-5 క్షిపణి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ సుబ్రోతోమిత్రా పరేడ్‌కు సారధ్య వహిస్తున్నారు.