ప్రధానితో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో గుజరాత్‌ సీఎం నేరేంద్రమోడీ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను ప్రధానిని కలిసినట్టు సమావేశం అనంతరం మోడీ తెలిపారు. గుజరాత్‌ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తాను ప్రధానిని కోరానని పేర్కొన్నారు. గుజరాత్‌లో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్లుల గురించి కూడా ప్రధానితో చర్చించినట్లు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, తమ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తానని హామి ఇచ్చారని స్పష్టం చేశారు.