ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యుత్ ఉద్యోగి మృతి

టేక్మా జనం సాక్షి సెప్టెంబర్ 30 టేక్మాల్ మండల పరిధిలోని దన్నారం సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఈశ్వర కుంట లో తెగిపోయిన 11 కేవీ వైరు సరి చేసేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు బేతయ్య మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి గజ ఈతగాళ్ళ సహాయంతో వెలికి తీశారు. బేతయ్య భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎ ఎస్సై దయానంద్ తెలిపారు.