ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
సారంగాపూర్, సెప్టెంబర్ 15, జనం సాక్షి…
సారంగాపూర్ మండలం లోని స్వర్ణ గ్రామం లో ప్రమాదవశాత్తు వ్యక్తి మృత్యు వాత పడడం జరిగింది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం… ” గురువారం రోజున సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్థానిక బాలల గణేష్ మండలి లో , అదే గ్రామానికి చెందిన ఐట్ల స్వామి s/o పెద్ద రాజన్న , వయస్సు 43, కులం- పద్మశాలి, వృత్తి- ఆటో డ్రైవర్ అనునతడు కూలర్ ప్లగ్ స్విచ్ బోర్డ్ లో పెట్టడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కూలర్ లో కరెంటు ప్రవహించి ఐట్ల స్వామి కి షాక్ తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగింది. మృతుని భార్య అయినా ఐట్ల పుష్ప పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్త్తు చేస్తున్నామని” పోలిసులు తెలపడం జరిగింది.
Attachments area