ప్రమాదానికి గురైన పెళ్లిబృందం వ్యాన్‌

మహబూబాబాద్‌,మే14(జ‌నం సాక్షి): మానుకోట  జిల్లాలోని భవానీనగర్‌ తండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. టాటా ఏస్‌ – డీసీఎం ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బైక్‌ను తప్పించబోయి పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను టాటా ఏస్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎంలో ఉన్న వారు గాయాలపాలయ్యారు. టాటా ఏస్‌లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.