ప్రాంతీయ పార్టీలను..  గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం


– కర్ణాటక సీఎం కుమారస్వామి
బెంగళూరు, మే20(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకి, మోదీకి పట్టం కట్టబోతున్నారంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేసిన వేళ… ఎగ్జిట్‌ పోల్స్‌ పై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. దేశంలో ఇంకా మోదీ గాలి వీస్తోందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు ఎగ్జిట్‌ పోల్స్‌ ను వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఎగ్జిట్‌ పోల్స్‌ ను విడుదల చేశారని, వీటిలో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు. ఇవి కేవలం ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రమేనని, ఎగ్జాక్ట్‌ (కచ్చితమైన) పోల్స్‌ కావని కుమారస్వామి అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెప్పించడం ద్వారా… ప్రాంతీయ పార్టీలు తమ ఆధీనంలోకి వచ్చేలా చేసుకోవడమే దీని వెనకున్న అసలు మర్మమని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత మెజారిటీ రాని పక్షంలో… ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. 295 నుంచి 305 సీట్లు వచ్చే పరిస్థితి బీజేపీకి లేదన్నారు. నిజంగా ఈ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వాస్తవమే అయితే గత నాలుగు నెలల కాలంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ చేసిన తప్పులు ఏమిటని అన్నారు. ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు మోదీ ఇచ్చిన వరాలు ఏమిటని ప్రశ్నించారు. మరో నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు మోదీకి వ్యతిరేకంగా ఏ రకమైన తీర్పును ఇవ్వబోతున్నారనే విషయం వెల్లడి కానున్న తరుణంలో చివరిగా ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో ఈ రకమైన ఆనందాన్ని పొందుతునందుకు బీజేపీ నేతలను చూసి జాలి పడటం తప్ప మరేవిూ చేయలేమని విజయశాంతి పోస్ట్‌ చేశారు.