ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా …సంవత్సరాలు గడుస్తున్న పూడ్చని గుంతలు

  సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై చంద్రంపేట చౌరస్తా వద్ద గత సంవత్సర కాలంగా ఏర్పడిన గుంతలు రోజురోజుకు మరింత లోతుగా తయారై వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వారికి గుంతలు ఉన్న విషయం తెలియక అందులో వచ్చి పడిపోతున్నారు ఈ విషయంపై అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ వారికి చీమకుట్టినట్టు కూడా లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వార్డు కౌన్సిలర్లు ఎలాగు పనిచేయడం లేదు కనీసం అధికారులైనా పట్టించుకోవాలని ప్రాణాలు పోతే కానీ గుంతలు పూడ్చరాని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే స్పందించి గుంతలు పూడ్చాలని లేనిపక్షంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని వార్డు ప్రజలు హెచ్చరించారు