ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం: ఒంగోల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్‌కు దక్షినశైపున గూడ్సురైలు కిందపడి యాసీన్‌ఖాన్‌, నాగలక్ష్మి  ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వారు. పోలీసులు సంఘటన స్థలని సందర్శించి నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు. అయితే నాగలక్ష్మికి గతంలోనే వివాహం జరిగినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.