ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..
బెంగళూరులో విద్యార్థినులపై అటెండర్ కాల్పులు
విద్యార్థిని గౌతమి మృతి…మరొకరి పరిస్థితి విషమం
బెంగళూరు, ఏప్రిల్ 1 : బెంగళూరులోని ప్రముఖ కార్పోరేట్ వైట్ఫీల్డ్లోని ప్రగతి కాలేజ్లో దారుణం జరిగింది. గౌతమి అనే విద్యార్థినిని అంటెడర్ మహేష్ కాల్చి చంపాడు. ఇంటర్ సెంకండియర్ చదువుతున్న గౌతమిని అటెండర్ మహేష్ గత కొద్ది రోజులుగా ప్రేమించమంటూ వేధింపులకు గురిచేశాడు. అయితే గౌతమి అతని ప్రేమ నిరాకరించడంతో పాటు వేధిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
దీంతో క్షక్ష్య గట్టిన మహేష్ గత రాత్రి లేడీస్ హాస్టల్కు చేరుకుని కాల్పులు జరిపాడు. పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు జరపడంతో గౌతమి అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన శిరీష అనే మరో విద్యార్థిని గాయపడింది. ఘటన తర్వాత అటెండర్ మహేష్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మహేష్ తుపాకీని ఎక్కడి నుంచి తెచ్చాడనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు హాస్టల్ను ఖాళీ చేసి వెళ్లిపోయారు.