ఫస్ట్ కూతపెట్టేది ట్విట్టర్ పిట్టే!

సోషvqxutabeల్‌ మీడియా రాకతో జనలకు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ సమాచారాన్ని చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. చివరకు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా సైతం సోషల్‌ మీడియాను అధారంగా చేసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నారనేది వాస్తవం. అయితే జనలుకు బ్రేకింగ్‌ వార్తలను చేరవేయడంలో ట్విట్టర్‌ టాప్‌లో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెళ్లడైంది. అమెరికన్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్, ట్విట్టర్‌లతో కలిసి డీబీ5 అనే సంస్థ ఐదువేల మంది సోషల్ మీడియా యూజర్లతో అధ్యయనం చేసింది. ట్విట్టర్ యూజర్లలో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది వార్తల్ని తెలుసుకోవడానికి ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.