ఫార్మాసిటీ,మెట్రోను రద్దు చెయ్యం

` ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు నిర్మాణం
` తద్వారా తగ్గనున్న దూరభారం: సీఎం రేవంత్‌రెడ్డి
` ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు పొడిగింపు
` అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం
` ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్‌గా అభివృద్ది
` జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం
` 100 పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్‌ కళాశాల..
` నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదు..
` అధికారులతో సమీక్షలో  సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,జనవరి1(జనంసాక్షి):మెట్రో పొడిగింపు, ఫార్మా సిటీలను రద్దు చేయమని, వాటిని స్ట్రీమ్‌లైన్‌ చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి  తెలిపారు. ఈ రెండుకూడా గతంకన్నామిన్నగా ఉంటాయని అన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ విూదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. సోమవారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్టుకి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరం తగ్గుంతుందని అన్నారు. బిహెచ్‌ఇఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 32 కిలోవిూటర్లు వస్తుందన్నారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, ఓవైసీస్‌ హాస్పిటల్‌ విూదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టు కి వెళ్లే మెట్రోలైన్‌కి లింక్‌ చేస్తామన్నారు. మియాపూర్‌ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు… అవసరమైతే మైండ్‌ స్పేస్‌ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్‌ డిస్టిక్ట్‌ వరకు పొడిగిస్తాం. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్‌పోర్టుకి మెట్రోకి వెళ్లేవారు దాదాపు ఉండరని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్‌ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని తెలిపారు. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి అదే ప్రాంతాల్లో గృహనిర్మాణం కూడా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడి వాళ్లు ఎవ్వరు కూడా హైదరాబాద్‌ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేటట్లు క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌గా మారుస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్‌ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్‌పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని.. స్కిల్స్‌ అదనంగా ఉంటాయని చెప్పారు. అక్కడ నుంచి బైటకి వెళ్లేవాళ్లకి క్యాంపస్‌లోనే ఎంపిక ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్‌ ఇప్పిస్తామని.. ఆయాదేశాలకు అవసరమైన మ్యాన్‌ పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పారు. ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని చెప్పారు. యువతకు ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని.. చాలా మంది సీనియర్‌ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని తెలిపారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. 100 బెడ్స్‌ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్‌ కళాశాల ఉంటుందన్నారు. 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూల మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామన్నారు. తనకు దగ్గర, బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. తాను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తామన్నారు. ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని వారికీ అవసరమైన మ్యాన్‌పవర్‌ను వాళ్లే ఎంపిక చేసుకుంటారని చెప్పారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమిస్తానని వాళ్ల పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవాలని సూచించారు. అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదన్నారు. జర్నలిస్టులకు సంబంధించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని.. ఇప్పటి నుంచి వందరోజుల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.’’ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం. ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జిలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించాం. 100 పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్‌ కళాశాల ఉంటుంది. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్‌ ఇప్పిస్తాం. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్‌పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత ఉంది. వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం’’ అని సీఎం తెలిపారు.
నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదు..
’’మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించా. వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్‌ లైన్‌ చేసే పనిలో ఉన్నాం. నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ఉండదు. ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. ఇప్పటినుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తాం.జనవరి 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూల మేరకు పదవులు కేటాయిస్తాం. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తాం. నాకు దగ్గరగా ఉంటాడనో.. లేదా బంధువనో.. పదవులు ఇవ్వడం ఉండదు. ఏది చేసినా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తాం’’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

 

హైదరాబాద్‌ అంటేనే ఎగ్జిబిషన్‌ గుర్తొస్తుంది
నాంపల్లి నుమాయిష్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,జనవరి1(జనంసాక్షి): నాంపల్లి మైదానంలో నుమాయిష్‌ ప్రారంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అంటేనే చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గుర్తొస్తాయన్నారు. నుమాయిష్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్‌ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హావిూ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్‌ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ నుమాయిష్‌ రాష్టాన్రికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని కొనియాడారు. ఇక రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను ఎంచుకున్నారని, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఎగ్జిబిషన్‌ ప్రారంభంతో హైదరాబాద్‌ నాంపల్లిలో నుమాయిష్‌ సందడి మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 83వ నుమాయిష్‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు.. మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ కొనసాగనుంది. 2నుంచి ప్రజలను ఎగ్జిబిషన్‌కు అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి పదిన్నర వరకు.. వీకెండ్స్‌లో రాత్రి 11 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌కి ఎంట్రీ ఫీజు 40 రూపాయిలుగా నిర్ణయించారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్‌ లో దేశ నలుమూలల నుంచి 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు.నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఇవ్వాల్టి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాంపల్లి పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అలాగే మెట్రో కూడా అర్థరాత్రి వరకు నడపనుంది.