ఫిక్సింగ్ క్రికెటర్లపై ఏవగింపు: ఎల్ కే అద్వానీ
న్యూఢిల్లీ, జనంసాక్షి: డబ్బు సంపాదించేందుకు క్రికెటర్లు మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ పాల్పడడం ఏవగింపు కలిగిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ వాఖ్యానించారు. ఇప్పటివరకు రాజకీయ నేతల అవినీతి పతాకశీర్షికలకు ఎక్కిందని ఇప్పుడు క్రీడాకారులు కూడా ఈ జాబితాలో చేరిపోయారని ఆయన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు.