ఫ్రాన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 42 మంది మృతి

gu3wn069ఫ్రాన్స్ : తూర్పు బోర్డియాక్స్‌లోని పిసెంగ్విన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు అక్కడి భద్రతా సిబ్బంది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న వెంటనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

దీంతో ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బస్సులో ఉన్న వారంతా పర్యాటకులే. విహారయాత్ర కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంతటి భారీ ప్రమాదం జరగడం 1982 తర్వాత ఇదే ప్రథమం అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.