బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంచం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నట్టు వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కస్టమ్స్‌ సుంకం పెంచబోమని ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. పెంపుపై అడిగిన ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ… అపఖ్యాతి పాలుకావడం తనకు ఇష్టం లేదని సమాధానమిచ్చారు. గత కొన్ని వారాలుగా బంగారం దిగుమతులు పడిపోతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.