బన్సల్,అశ్వనీకుమార్ రాజీనామాలను ఆమోదించిన ప్రణబ్
న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు పవన్కుమార్ బన్సల్, ఆశ్వనీకుమార్ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆమోదించారు. మంత్రులిద్దరు తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.