బస్సులో మంటలు : 14 మంది సజీవ దహనం

88888చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.నింగ్జియా రీజియన్‌ రాజధాని యిన్‌చౌన్‌లో నేటి ఉదయం ఒక బస్సులో మంటలు చెలరేగడంతో 14 మంది ప్రయాణీకులు మృతి చెందారు. 32 మందికిపైగా గాయాల పాలయ్యారు. బస్సులో మంటలు చెలరేగిన పది నిముషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు ప్రారంభించారని నింగ్జియా అగ్నిమాపకదళం అధికారి తెలిపారు.