బహిరంగ సభ ప్రాంగణంలను పరిశీలించిన:అదనపు కలెక్టర్..*

ధర్మపురి (జనం సాక్షి )ఐ. టి., పరిశ్రమల శాఖా మంత్రి పర్యటన నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు. ఈ నెల 3 న రాష్ట్ర ఐ. టి., పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలలో పలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ధర్మపురి లో పనులను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. హేలీ ప్యాడ్, పైలాన్, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, బహిరంగ సభ ప్రాంగణం లను అదనపు కలెక్టర్ పరిశీలించి, ఇంచార్జి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పనులను రేపటి లోగా పూర్తి చేయాలని, బందోబస్తు ఏర్పాటు చేయాలని సంభందిత అధికారులను, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పర్యటనలో ఇంచార్జి అధికారులు మెట్ పల్లి ఆర్డీఓ డి. మధు, డిఎస్పి రవీందర్,
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సాయిబాబా, రోడ్లు భవనాల శాఖ ఈ ఈ శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ రమేష్, రెవెన్యూ,ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.