బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలి

జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ బల్ నగర్  కాలనిలో బహుజన సంఘర్షణ సమితి కార్యాలయం ను  రిటైర్డ్ ఏఈ  అంజయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.  బహుజన హక్కుల కోసం బహుజన సంఘర్షణ సమితి ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సంస్థ  చేస్తున్న అభివృద్ధి పనులకు  ఎల్లపుడు  సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మనియర్ పల్లి నర్సమ్మ డివిజన్ అధ్యక్షులు రాయికోటి నర్సిములు, సామాజిక నాయకులు కవి రచయిత పెద్ద గొల్ల నారాయణ,సామాజిక నాయకులు కోట ధనరాజ్ గౌడ్ ప్రముఖ సింగర్ సంధ్య పాటిల్ టి వీవీ జిల్లా కోశాధికారి సావిత్రి, గిరిజన జన సమితి అధ్యక్షులు వినోద్ రాథోడ్ నాయకులు సంగమేశ్వర్, నర్సిములు,  వివిధ పత్రికల విలేకరులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు