బహుజన సంఘర్షణ సమితి మండల అధ్యక్షుడు గా మ్యాతరి నర్సిములు

ఝరాసంగం; బహుజన సంఘర్షణ సమితి ఝరా సంగం మండల అధ్యక్షులు కుప్పా నగర్ కు చెందిన మ్యాతరి నర్సిములు ఎన్నికయ్యారు. శనివారం జహీరాబాద్ బహుజన సంఘర్షణ సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు మనియర్ పల్లి నర్సమ్మ ఆయన కు నియామక పత్రం అందజేసి శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా మ్యాతరి నర్సిములు నా పై నమ్మకం తో ఝరాసంగం మండల బి ఎస్ ఎస్ అధ్యక్షులు గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మండలం బహుజన హక్కుల సాధన కు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ రాయికోటి నర్సిములు, సావిత్రి, విరేశం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.