బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోండి

సుప్రీంకోర్టు

ఢిల్లీ : వరద బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. బాధితులను తరలించేందుకు అవసరమైన హెలికాప్టర్లు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అధికారులను అదేశించింది. చేపట్టిన సహాయ, పునరావాస చర్యలపై ఈ నెల 25 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది.