బాధిత కుటుంబాని పరామర్శ

బాధిత కుటుంబాని పరామర్శ

కొడకండ్ల అక్టోబర్ 3 (జనం సాక్షి) కొడకండ్ల మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దూదిమెట్ల సోనాబాబు సతీమణి స్వర్ణలత హైదరాబాదులో హాస్పిటల్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించగా వారి భౌతిక దేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ, స్థానిక ప్రజాప్రతినిధులుపార్టీ శ్రేణుల తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పoచ్ వల్లూరి సైదులు ,గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దెల బిక్షపతి, పాలకుర్తి దేవస్థానం డైరెక్టర్ దుబ్బాక భాస్కర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వల్లూరి రామస్వామి,మండల యూత్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, బొబ్బిలి కనకయ్య,యాదవ సంఘం కార్యదర్శి వల్లపు అనిల్, మాజీ సర్పంచ్ వల్లూరి సోమల్లు, వార్డ్ మెంబర్స్ శీను, రవి, సీనియర్ నాయకులు దర్గయ్య, రామచంద్రు, ఆంజనేయులు, లచ్చయ్య,రణదీర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.