బాపూ చూపిన మార్గం ప్రపంచానికే మార్గదర్శకం. జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.

బాపూ చూపిన మార్గం ప్రపంచానికే మార్గదర్శకం. జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి:
బాపూ చూపిన శాంతి, అహింసా మార్గం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.
అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని సోమవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో మహాత్ముని చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అహింసా సిద్ధాంతంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు.ప్రపంచం లో ఏ దేశమైనా గాంధీ చూపిన మార్గమే శిరోధార్యం అని తెలుసుకొని పాటిస్తున్నా యని చెప్పారు.ఆ నాడు మహాత్ముడు చెప్పిన స్వఛ్చత, పరిశుభ్రత అనే మాటలు నేడు పట్టణాలతో సహా పల్లె పల్లెలు పాటిస్తు న్నాయని అన్నారు.దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అన్న జాతిపిత నినాదాన్ని చాటుతూ దేశంలో గ్రామాలు ప్రగతి సాధిస్తు న్నాయన్నారు.మహనీయుని అడుగు జాడల్లో యువత పయనించాలని ఆయన కోరారు