బాబు అవినీతికి రైతుల బలి: జివిఎల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేతల అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే భయంతోనే ఏపీ ప్రభుత్వం సీబీఐకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌

నరసింహారావు విమర్శించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రజలకు రాజధాని పేరుతో చంద్రబాబు సినిమా చూపిస్తున్నారన్నారు. ఎకరా రూ.10 లక్షలకే కొనుగోలు చేసి రైతులను మోసం చేశారని ఆరోపించారు. అమరావతిని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, టీడీపీ నాయకుల స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గమని, టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ. 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని జీవీఎల్‌ ఆరోపించారు.