బాబు కాపులను మోసం చేస్తున్నాడు

– గతంలో ఇస్తామన్న కాపు రిజర్వేషన్లు ఏమైయ్యాయి?

– వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని

హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తూనే ఉన్నారని వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులు ఈబీసీల్లో సగం అంటూ మరోసారి చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్‌ హావిూ ఏమైందని, మంజునాథ కమిషన్‌ పేరుతో కాలయాపన చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు కాపులను ఏకాకిని చేసే కుట్రలు చేస్తున్నారని, ఈ కుయుక్తులను కాపు సోదరులంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మంజునాథ కమిషన్‌ నివేదిక ఇవ్వకుండానే అసెంబ్లీలో చట్టం చేశామన్నారన్నారు. కాపులందరూ బీసీలు అయిపోతారని హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు తగాదా పెడుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా గురించి మొదటి నుంచి పోరాడింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ¬దా కోసం పోరాటాలు చేస్తే జైలులో పెడతామని చంద్రబాబు బెదిరించారని, ఇప్పుడు ¬దాపై యూటర్న్‌ తీసుకుని ధర్మపోరాట డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కుయుక్తులను గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికే బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు నాయుడు, తన పనులు పూర్తయ్యాక బీజేపీ నుంచి విడిపోయి సానుభూతి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. బాబుకు తగిన గుణపాఠం తప్పదని పేర్ని నాని హెచ్చరించారు.