బాలలకు లైంగికంగా వేదింపులు

బౌధ్ద సన్యాసిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

పాట్నా,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): అంతర్జాతీయంగా బౌద్ధమత యాత్రికులకు కేంద్రంగా విలసిల్లుతున్న బుద్ధగయలో శిష్యులను దుర్భషలాడినందుకుగానూ ఓ బౌద్ధ సన్యాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌లోని బుద్ధగయలో విద్యనభ్యసిస్తున్న 15మంది బాలురను ఓ బౌద్ధ సన్యాసి లైంగికంగా వేధించడంతోపాటు, అసభ్య పదజాలంతో దూషించినట్లు గయ ఎస్పీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15మంది చిన్నారులతో ప్రసన్న జ్యోతి బుద్ధిస్ట్‌ స్కూల్‌ అండ్‌ మెడిటేషన్‌ సెంటర్‌ పేరుతో మస్తీపూర్‌ గ్రామంలో బౌద్ధమఠం నిర్వహిస్తున్నారు. ఇందులోని చిన్నారులంతా అసోంలోని కార్బి ఆంగ్లోంగ్‌ జిల్లాకు చెందినవారు. ఈ క్రమంలో బౌద్ధసన్యాసి అందులో చదువుకుంటున్న బాలురను లైంగికంగా వేధించాడని, దుర్భషలాడాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బౌద్ధ సన్యాసిని అదుపులోకి తీసుకుని పట్టణ డిప్యూటీ ఎస్పీ సమక్షంలో విచారించగా బాలురని లైంగికంగా వేధించినట్లు తేలింది. శుక్రవారం 15మంది బాలురను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి వారిచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. అంతకుమ ముందే వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

———