బిఆర్ఎస్ లో 30 మంది నల్లూరు యువకులు చేరిక

(జనం సాక్షి )ఫిబ్రవరి 16
ముప్కాల్ మండల పరిధిలోని నల్లూరు గ్రామంలోని యువకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఎస్పీ పార్టీ నుంచి 30 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు మండల ఎంపీపీ వెంకట్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు వారికి ప్రశాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు యువకుల అభివృద్ధి భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా చేస్తోందని దానికి ఆకర్షితులైన యువత అనేకమంది పార్టీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లూరు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లికొండ రఘునాథ్ యూత్ అధ్యక్షుడు సాయికుమార్ సాపల్లి మహేష్ కుమార్ రియాజ్ వికాస్ సద్దాం రవి ఉన్నారు