బిఎస్పీ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం

బిఎస్పీ పార్టీ తోనే  అభివృద్ధి సాధ్యం  అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధు రావణ్ అన్నారు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని శాంతినగర్, రాంనగర్ మైనార్టీ యువకులు బహుజన్ సమాజ్ పార్టీలో చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిద్దు రావణ్  మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే యువకులు బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయించాలని,  భవిష్యత్ లో రాబోయేది బహుజన రాజ్యం అని, బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుపడతాయని తెలియజేశారు. దేశంలో ఉన్న యువత   రాజ్యాధికారం  కోసం, కలిస్తే నిలుస్తాం- నిలుస్తే  గెలుస్తాం – గెలిస్తే వ్యవస్థను మార్చేస్తాం అని హితబోధ చేశారు.జహీర్,జమీర్, అయుబ్, లతీఫ్,కిట్టు, గౌరీ లు బిఎస్పీలో చేరారు. వారికి శాలువతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పి. బాబురావు జిల్లా ఇంచార్జ్ ,వినోద్, యాదగిరి, రాచప్ప, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.