బిజెపి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.

బిజెపి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 4. (జనంసాక్షి). సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు వర్చువల్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి ఫోటో లేదని టీవీని పగలగొట్టిన హరీష్ రావు చర్యలను నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ అహంకారపూరితంగా వ్యవహరించిన మంత్రి హరీష్ రావు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. నిరసన కార్యక్రమంలో ఆడెపు రవీందర్, కౌన్సిలర్ గూడూరు భాస్కర్. చేన్నమనేని కమలాకర్ రావు,ఎనగంటి నరేష్, గాజుల సదానందం, శ్రీధర్, గణేష్, రమేష్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.