బిసిలకు అండగా టిడిపి

వైకాపా విమర్శల్లో అర్థం లేదు: అనూరాధ

విజయవాడ,జనవరి28(జ‌నంసాక్షి): బీసీ విద్యార్ధులకు విదేశీ విద్య వైఎస్‌ హయాంలో అందని ద్రాక్షలా ఉండేదని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. గతంలో బీసీ ఫెడరేషన్లు అని చెప్పి వైఎస్‌ బీసీలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారన్నారు. రూ.100 కోట్లతో బీసీ భవన్‌ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ప్రకటన హర్షణీయమన్నారు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నేతలు ధర్మాన ప్రసాద్‌, పార్థసారథి వాస్తవాలు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. బిసిలకు టిడిపి ముందునుంచి అండగాఉందన్నారు. టిడిపి మాత్రమే బిసిల సంఓఏమానికి చిత్తశుద్దితో పనిచేస్తోందని సోమవారం నాడిక్కడ అన్నారు.