బీఅర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కౌన్సిలర్ సంగీత ఠాకుర్.

బీఅర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కౌన్సిలర్ సంగీత ఠాకుర్.  

తాండూరు అక్టోబర్ 6(జనంసాక్షి)బీఅర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు గా 20వ వార్డ్ కౌన్సిలర్ సంగీత ఠాకుర్ ను నియమిస్తూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణం తన నివాసంలో 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఇంటికి తీసుకవెల్లి ప్రచారం చేయాలని అన్నారు. బీఅర్ఎస్ పార్టీనీ మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సందర్భంగా బీఅర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకుర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు గాను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి,సీనియర్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలపేతానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళ ఆత్మ ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, పట్టణ అధ్యక్షులు అప్పు నయుం, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి రాజన్ గౌడ్ ,గోపాల్, ఇంతియాజ్ బాబా
తదితరులు ఉన్నారు.