బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకుడు.

బెల్లంపల్లి, అక్టోబర్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు చిలుముల సాయి కుమార్ సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కెసిఆర్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు సాయి కుమార్ తెలిపాడు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, కో అప్షన్ సభ్యుడు చాంద్ పాషా, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగం గణేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.