బీజేపీపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్
న్యూఢిల్లీ, జనంసాక్షి: యుపిఏ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపిపై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. ఢీల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. బిజెపి పాలిత రాష్ట్రల్లోనే అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. మరోవైపు బిజెపి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.